ప్రభువునందు ప్రియ సోదర సోదరీమణులకు!
ఆధునిక భారతదేశ నిర్మాణంలో క్రైస్తవ మిషనరీల పాత్ర అనే టైటిల్ మీద కాకినాడలోని చొల్లంగిలో AFD సెమినార్ దేవునికి మహిమ కరంగా ఎంతో ఘనంగా జరిగింది. ఓ 50 నుండి 80 మంది అటెండ్ అవుతారేమోనని నేను అనుకున్నాను కానీ, నా అంచనాకు మించి సుమారుగా 100 మందికి పైగానే అటెండ్ అయ్యారు. సెమినార్ నిర్వహించిన సోదరులైతే ఏకంగా 120 మందికి లంచ్ ప్రిపేర్ చేసినట్లు చెప్పారు.
ఎన్నో నెలల నుండి AFD (Answering False dogma What’s App Group) లో కనెక్ట్ అయిన కొందరు సోదరులను ఈ సెమినార్ ద్వారా ముఖాముఖీగా కలుసుకున్నాను.
ఈ సెమినార్ నిర్వహించిన దైవజనులు కొంకి ఎజ్రా శాస్త్రి గారికి, బ్రదర్. రూబెన్ పాల్ గారికి, బ్రదర్. రాకేష్ బాబు గారికి నా హృదయ పూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.
Suresh Babu Puritigadda – 8686357974